PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గృహ లబ్ధిదారులతో హౌసింగ్ డిఈఈ ప్రభాకర్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్నటువంటి ఇండ్లకు ఎప్పటికప్పుడు బిల్లులు మరియు ఇంటి సామాగ్రిని అందజేస్తున్నట్లు హౌసింగ్ డిఈఈ ప్రభాకర్ గృహ లబ్ధిదారులతో అన్నారు.మిడుతూరు మండలంలోని కలమందలపాడు, మిడుతూరు,రోళ్లపాడు గ్రామాలలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డితో కలసి ఆయన పర్యటించారు. గృహాలబ్దారులు త్వర త్వరగా ఇండ్లు పూర్తిచేయాలని అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాదృష్టికి తీసుకురావాలన్నారు.అవసరం ఉన్నవారికి పొదుపు సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉందన్నారు.ఉగాదిలోపు అందరూ కూడా ఇండ్లను పూర్తి చేయుటకు సహకరించవలసిందిగా ఆయన కోరారు.ఈకార్యక్రమంలో హౌసింగ్ ఇన్చార్జి ఏఈ జె.రమేష్,పంచాయతీ కార్యదర్శులు అశ్రఫ్ భాష,సుధీర్ నందకుమార్,విజయ కుమారి,విఆర్ఓ రాఘవేంద్ర,వర్క్ ఇన్స్పెక్టర్లు,మాసపేట ఇంజనీరింగ్ అసిస్టెంట్ భాష మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author