NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హౌసింగ్​ ఈ.ఈ.గా బాధ్యతలు స్వీకరించిన పి. వెంకటదాసు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు హౌసింగ్​ నూతన ఈ.ఈ.గా వెంకటదాసు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.  మదనపల్లె నుంచి వచ్చిన జనరల్​ ట్రాన్సఫర్​ కింద వచ్చిన  ఈ.ఈ. పి. వెంకటదాసు శుక్రవారం ఉదయం  కలెక్టరేట్​ లోని హౌసింగ్​ పి.డి. కార్యాలయంలో పి.డి ( ఎఫ్​ఏసీ)  అజయ్​ కుమార్​ ను  మర్యాదపూర్వకంగా కలిశారు.  ఇప్పటి వరకు హౌసింగ్​ ఈఈ ( ఎఫ్​ఏసి) గా అర్బన్​ డి.ఈ. ప్రభాకర్​  కొనసాగారు. ఒకన్నటిర ఏడాదిగా ఎఫ్​ఏసీలతో కొనసాగిన ఈఈ పదవి… పి. వెంకటదాసు రాకతో భర్తీ అయిందని,  ఇక నుంచైనా హౌసింగ్​ పనులు శరవేగంగా ముందుకు వెళ్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. హౌసింగ్​ పి.డి. అజయ్​ కుమార్ ను కలిసిన వారిలో  అర్బన్​ డి.ఈ.ప్రభాకర్​ ,  అర్బన్​ ఏఈ సత్య భాస్కర్​, కర్నూలు రూరల్​ ఏఈ. రామయ్య తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *