PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హౌసింగ్​ పాత బకాయిలు… చెల్లించాల్సిందే..

1 min read

పల్లెవెలుగు. నందికొట్కూరు: గత ప్రభుత్వం లో ఇల్లు కట్టించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలని, జగనన్న కాలనీ లో ఇల్లాస్థలాలు వచ్చిన పేద వారికీ ఇళ్ళు కట్టించి ఇవ్వాలని సిపిఐ తాలూకా కార్యదర్శి రమేష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జూపాడు బంగ్లా కి వచ్చిన నందికొట్కూరు హౌసింగ్ డీ ఈ ప్రభాకర్ కు సీపీఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. హౌసింగ్​ పాత బకాయిలు చెల్లించడంతోపాటు ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలో జగనన్న ఇళ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని రమేష్​ బాబు డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఐ నాయకులు నరసింహ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author