PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ని ర‌త్నాలు ప్ర‌జ‌లకు అందుతున్నాయ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ నవరత్నాలలో ఎన్ని రత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా జరగడం లేదన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం శ్రీశైలం క్షేత్రాన్నిఅభివృద్ధి చేయకపోగా.. భక్తులు ఇచ్చే కానుకలు, క్షేత్ర ఆదాయాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. గడపగడపకు కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

                                  

About Author