PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరంకుశ‌త్వం ఇంకెన్నాళ్లు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ కథనాన్ని షేర్ చేశారన్న ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్, అందుకు నిరసనగా ఆందోళనకు దిగిన జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరుపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో జర్నలిజానికి సంకెళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డ లోకేశ్.. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చీకటి జీవో తీసుకొచ్చారని విమర్శించారు. అంతటితో ఆగని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టి పాత్రికేయులను అరెస్ట్ చేస్తోందని మండిపడ్డారు. ఇంకెంత కాలం ఈ నిరంకుశత్వం అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

                                                    

About Author