NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌నం ఎంత బంగారం దిగుమ‌తి చేసుకుంటామంటే.. షాకింగ్ ఫ్యాక్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌న దేశం బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం సుమారు రూ.3.45 లక్షల కోట్లు విలువైన బంగారం దిగుమతి అయినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21లో బంగారం దిగుమతుల విలువ 34.62 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్యలోటు 192 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవ త్సరంలో 103 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం.

                                 

About Author