PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాసముద్రంపై భారీ అంచనాలు

1 min read

సినిమా డెస్క్​: కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గాక షూటింగ్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘మహాసముద్రం’ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. శర్వా, సిద్దా ఇద్దరి జోడీతో కూడిన పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. 2019లోనే మహాసముద్రం మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. అయితే 2020 కరోనా పరిస్థితుల వల్ల అన్ని చిత్రాల మాదిరే ఈ సినిమా షూటింగ్ కూడా డిలే అయ్యింది. ‘ఆర్ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని వైజాగ్ బ్యాక్‌డ్రాప్లో సాగే, క్రైమ్ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఫస్ట్ మూవీతో బ్లాక్‌ బస్టర్ ఇచ్చాడు అజయ్‌. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో అను ఇమ్మానియేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లు. విలన్‌గా ‘కెజిఎఫ్’ ఫేమ్ గరుడ రామ్ నటిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

About Author