PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా నుంచి భారీగా పెరిగిన దిగుమ‌తులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యా నుంచి భారత్‌కు ఈ ఏడాది దిగుమతులు భారీగా పెరిగాయి. కేంద్ర వాణిజ్య శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 8.6 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులు రష్యా నుంచి భారత్‌కు వచ్చాయి. 2021లో ఇదే కాలంలో ఈ దిగుమతుల విలువ 2.5 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మూడున్నర రెట్లు అధికంగా దిగుమతులు నమోదయ్యాయి. ఈ సారి ఏప్రిల్‌, మే నెలల్లోనే రష్యా నుంచి వచ్చిన దిగుమతుల విలువ 5 బిలియన్‌ డాలర్లు దాటింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా అనేక ఐరోపా దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

                                   

About Author