PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యతో వినయం వివేకం సాధ్యం              

1 min read

జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల  హెచ్.యం.వెంకమ్మ స్పష్టం                             

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యతోనే వినియం వివేకం సాధ్యపడుతుందని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకమ్మ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన  పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. తల్లి తండ్రులు పిల్లలను సక్రమంగా పాఠశాలకు పంపించాలని,వారి విద్యాభివృద్ధికి నిరంతరం ఉపాద్యాయులకు సహకరిస్తే వారిని మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దవచ్చు అని ఆమె విద్యార్థులు తల్లిదండ్రులకు సూచించారు.అలాగే తల్లి తండ్రుల సమావేశం అనంతరం 10 వ తరగతి విద్యార్థులను సమావేశ పరచి వారివిద్యాప్రగతిని అడిగితెలుసుకునీ,  సమీక్షించారు.వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు చక్కగా చదువుకోవాలని, టీచర్లు చెప్పిన అంశాలను ప్రతి రోజు మననం చేసుకోవాలని అన్నారు.బడికి క్రమం తప్పకుండా హాజరు కావాలని సూచించారు.ఈ సమావేశంలో ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

About Author