NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకలితో.. ఎవరూ ఉండకూడదు..

1 min read

– హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ మైనుద్దీన్
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: కరోన కర్ఫ్యూ కారణంగా ఎవరూ ఆకలితో అలమటించరాదన్న సదుద్దేశంతో సుగవాసి ప్రసాద్​ బాబు ఆర్థిక సహకారంతో అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తున్నారు. మంగళవారం రాయచోటి బస్టాండ్​ పరిధిలోని అనాథలు, యాచకులకు హెల్పింగ్​ హ్యాండ్స్​ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు, వాటర్​ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ మైనుద్దీన్ మాట్లాడుతూ ఆహారం లేక అవస్థలు పడుతున్న ఎందరినో ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ మరియు సంస్థ సభ్యులు అసద్ అబూ రియాజ్,రిహాన్,నాగార్జున, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

About Author