PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12 మంది ఎమ్మెల్యేల‌పై వేటు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌హారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల‌పై అసెంబ్లీ స్పీక‌ర్ వేటు వేశారు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రక‌టించారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీలో రెండు రోజుల పాటు కొన‌సాగ‌నున్న అసెంబ్లీ స‌మావేశాలు ర‌సాభాస‌గా మారాయి. ఓబీసీ రిజ‌ర్వేష‌న్లతో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌ర‌పాల‌ని బీజేపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. అసెంబ్లీ ఇన్చార్జీ స్పీక‌ర్ భాస్కర్ జాద‌వ్ పై బీజేపీ స‌భ్యులు దురుసుగా ప్రవ‌ర్తించారు. ఈ నేప‌థ్యంలో వారిని ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ స్పీక‌ర్ నిర్ణయం తీసుకున్నారు. స్పీక‌ర్ వాద‌న‌ను మ‌హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్నవిస్ ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ ను దూషించ‌లేద‌ని తెలిపారు.

About Author