PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే సీటు కోసం భార్యాభర్తల పోటీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే అసెంబ్లీ స్థానం కోసం భార్యాభర్తలు పోటీపడుతున్నారు. సరోజనీనగర్‌ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాద్‌ మంత్రివర్గంలోని స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్‌ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ సింగ్‌ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గం ఎన్నిక జరగనుంది.దయాశంకర్‌ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్‌ యాదవ్‌ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. స్వాతి సింగ్‌ ప్రస్తుతం పలు శాఖల సహాయ మంత్రిగా, స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. అయితే.. వీరిద్దరిలో సీటు ఎవరిని వరిస్తుందో ఆసక్తికరంగా మారింది. వీరిని కాదని మూడో వ్యక్తికి కూడ అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోలేదని స్థానికులు చర్చిస్తున్నారు.

          

About Author