PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేను అందరివాడిని : టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తాను అందరివాడినని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. సోమవారం నగరంలోని 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ అన్ను గ్రూప్ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టిజి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరిని తాను ఆదరించి సేవ చేస్తానని చెప్పారు. తాను ఏ ఒక్క వర్గం, మతం వాడిని కాదని.. తాను అందరివాడినని ప్రజలకు చెప్పారు. తనకు ఎమ్మెల్యే గా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తాను ఎమ్మెల్యే అయితే స్వాతంత్రం వచ్చిన సమయం నుండి ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. కర్నూలును ఎలా అభివృద్ధి చేయాలో తనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. ప్రజలు కులమతాలు చూడకుండా తనను గెలిపించాలని కోరారు. ఒక్క అవకాశం ఇచ్చి తన పాలన చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన మన్సూర్, జహంగీర్, షెక్షా, చాంద్, ఖాజా, శాలు, వార్డు ఇంచార్జి ఇబ్రహీం, టీడీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author