PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేను లోకల్..నాకే మీ ప్రథమ ఓటు.. టిడిపి అభ్యర్థి జయసూర్య

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం రోజు చర్చిల్లో నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు, మిడుతూరు గ్రామాల్లో ఏబీఎం మరియు ఆర్.సి.యం,సిఎస్ఐ చర్చిల్లో జయసూర్య ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.జయసూర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారని ఆయన తలంపు నెరవేర్చే విధంగా దేవుడు ఆయనకు తోడుగా ఉండాలని కోరుతూ పాస్టర్లు ప్రార్థన చేశారు.నేను అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిని..నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నన్ను గెలిపిస్తే మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కడప నుండి వచ్చిన వారిని గెలిపిస్తే మీరు కడపకు వెళ్లి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను లోకల్ వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానంటూ జయసూర్య మహిళలు ప్రజలతో ఆయన అన్నారు. అనంతరం సంఘ పెద్దలు ఆయనను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,పగిడాల పలుచాని మహేశ్వర్ రెడ్డి,కడుమూరు ఇద్రీస్ ఆయా గ్రామాల సంఘ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

About Author