NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీకు తోడుగా నేనున్నాను.. వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక  

1 min read

ఘనంగా స్వాగతం పలికిన 11వ వార్డు వైఎస్సార్సీపీ నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు  : మన ప్రియతమ నాయకురాలు వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక  ఈ రోజు 11 వ వార్డ్ కుని పంజా మైదానం నుండి ప్రచారం మొదలు పెట్టారు ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రజలందరికీ ఫలాలు అందించిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ,ఇలాగే మీరు ఆశీర్వదిస్తే ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వస్తారు అని అన్నారు. ప్రతి గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు.నాయకులు  కార్యకర్తలతో కలిసి ప్రతి కార్యకర్తను కలుస్తూ పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలకున్న సమస్యలు వింటూ హామీలు ఇస్తూ నన్ను ఆశీర్వదించండి మీకు తోడుగా నేనున్నాను అంటూ చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో  నాయకులు బుట్టా శివనీలకంఠ , 11వ వార్డు కౌన్సిలర్ నజీర్ వైస్ చైర్మన్ , పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య , టౌన్ బ్యాంక్ చైర్మన్  యు.కె.రాజు,జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు రసూల్,వక్ఫ్ బోర్డు జిల్లా ఉపాధ్యక్షులు రియాజ్, కౌన్సిలర్లు రుద్రాక్షల బాజరి,రాజారత్నం,సుధాకర్,ఇన్ ఛార్జ్ లు, వార్డుసభ్యులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.

About Author