NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినిమా కోసం ఎలుక వండుకు తిన్నాను !

1 min read

పల్లెవెలుగు వెబ్​: లిజోమోల్  జై భీమ్ చిత్రంలో అందరితో కన్నీళ్లు పెట్టించే సినతల్లిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటించింది. ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశానంటోంది లిజోమోల్‌. ప్రతిరోజూ గిరిజనుల గుడిసెలకు వెళ్లేదాన్నని, అక్కడ వాళ్లు చేసే పని నేర్చుకుని వాళ్లతో కలిసి పని చేసేదాన్నని చెప్పుకొచ్చింది. వాళ్లు చెప్పులు వేసుకోరని, పగలూరాత్రి తేడా లేకుండా వేటకు వెళ్తారని, అవన్నీ తాను కూడా చేశానంటోంది. సినిమాలో పాము కాటుకు మందులు ఇస్తుంటానని, అది నిజంగానే నేర్చుకున్నానని తెలిపింది. ‘వాళ్లు ఎలుకలను వేటాడి వండుకుని తింటారు. ఏవి పడితే అవి కాకుండా పొలాల్లో దొరికేవే తింటారు, నేను వాళ్లలా ఉండాలంటే వాళ్లు చేసినవన్నీ చేయాలనుకున్నాను. అందుకే ఎలుక కూర తిన్నాను’ అని చెప్పుకొచ్చింది.

About Author