PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రజలకు నేను అండగా ఉంటా.. టి.జి భరత్

1 min read

– అభివృద్ధి చేయకపోతే 2029లో నాకు ఓటు వేయకండి.. టిజి భరత్
– 42 వ వార్డులో భారీగా టిడిపిలోకి చేరికలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ భరోసా ఇచ్చారు. శనివారం నగరంలోని 42 వ వార్డు బాబాబ్రుందావన్ నగర్లో యువ నేత హరి ఆధ్వర్యంలో భారీగా యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. టీజీ భరత్ యువతకు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ కర్నూలు ప్రజల భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే అయితే కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చి తన పరిపాలన చూడాలని కోరారు. కర్నూల్లో అభివ్రుద్ది చేయకపోతే మరోసారి తనకు ఓటు వేయొద్దని చెప్పారు. ప్రజలు ఆలోచించుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇండస్ట్రీయల్ జోన్ ఉన్న కర్నూల్లో ఇప్పటికే చాలా పరిశ్రమలు రావాల్సి ఉన్నా రాలేదన్నారు. తనకున్న అనుభవం, పరిచయాలతో ఇక్కడి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తానన్నారు. నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ లాంటి విజన్ ఉన్న నేతలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ భవిష్యత్తు బాగుండాలంటే టిజి భరత్ ను ఎమ్మెల్యే చేసుకుందామని ప్రతిజ్న చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి సయ్యద్ ఫయాజ్, క్లస్టర్ ఇంచార్జి చంద్రశేఖర్, నేతలు గంగాధర్, మధు, మనోజ్, సాయి, సత్య, తదితరులు పాల్గొన్నారు.

About Author