మీ నమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
1 min read
ఆంద్రప్రదేశ్ మున్సివల్ వర్కర్స్ యునియన్ నాయకులకు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి హామీ
కర్నూలు, న్యూస్ నేడు: గత కొన్ని సంవత్సరముల నుండి మున్సిపల్ శాఖలో ఇంజనీరింగ్ కార్మికులు, అత్యవసర విభాగంలో పనిచేయుచున్న వారు ఈ రోజు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డిని జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కలుసుకొని తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరం కోసం కృషిచేస్తాననీ వారికి హామీ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఒక్కొక్కటిగా ఆయన దృష్టికి వివరించారు.ముఖ్యంగా అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీది దిపాల కార్మికులకు ఇంజనీరింగ్ టెక్నికల్, నాన్టేక్నికల్ వారు రూ.,29,200, అలాగే 24,500 చెల్లించాలనీ, ప్రభుత్వ సంక్షే మ పథకాలు అమలు చేయ్యాలనీ, 15 సంవత్సరములు పైబడిన కార్మికులను క్రమబద్దీకరించాలనీ, 52 అధివారాలు, మరియు పండుగదినాల సెలవులు వర్తింపజేయాలనీ, విధినిర్వహణలో చనిపోయిన కార్మికునికి రూ. 10 లక్షలు, మరియు కుటుంభంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ, అంగవైకల్యం పొందిన వారికి రూ. 5 లక్షలు మరియు వారి కుటుంభంలో ఒకరికి ఉద్యోగవకాశం కల్పించాలనీ, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు కూడా పదవి విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలనీ, పదవి విరమణ తర్వాత ఇతర ఉ ద్యోగుల మాదిరి గ్రాడ్యుటీతోపాటు కనీస పెన్షన్ పదివేల రూ. ఇవ్వాలనీ పదవీ విరమణ తర్వాత వారి కుటుంభంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ కూరుతూ వారు తమ డిమాండ్లను విన్నవించారు.దీనికి స్పందించిన తిక్కారెడ్డి తాను సంభందిత శాఖ మంత్రివర్యఅల దృష్టికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు దృష్టికి, సమస్యలను తీసుకొని వెళ్లి వారి ద్వారా సాధ్యమైనంత మేరకు పరిష్కారానికి కృషిచేస్తాననీ వారికి తెలియజేయడం జరిగినది.కార్యక్రమంలో పార్టీ నాయకులు జె. పుల్లయ్య చౌదరి, బెత కృష్ణుడు, యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు యస్. మనోహర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగశేషులు, కోశాధికారి సునీల్, నగర అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు, యం. నారాయణ, పీరా, జి. మధు, మరియు కార్మికులు పాల్గొన్నారు.