NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇడా చైర్మన్ బోద్దాని ని మర్యాదపూర్వకంగ కలిసిన వైసిపి నాయకులు

1 min read

కాంట్రాక్టర్ గోలి శరత్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బోద్దాని శ్రీనివాస్ ని. ఏలూరు జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ కాంట్రాక్టర్ గోలి శరత్ రెడ్డి  బోద్దాని చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శరత్ రెడ్డి మాట్లాడుతూ     బోద్దాని  పార్టీ ఆవిర్భావం నుండి పార్టీని నమ్ముకుని జిల్లాలో మంత్రులచే, ఎమ్మెల్యేల చే, వివిధ క్యాడర్లో ఉన్న వైసీపీ పార్టీ నాయకుల తో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నన్నారు. విపత్కర కరోనా సమయంలో ఆయన అందించిన సేవలు ఏలూరు జిల్లా ప్రజలు మరువలేరన్నారు. చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ  బోద్దాని ఇడా చైర్ పర్సన్ గా  ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇవే మా హృదయపూర్వక అభినందనలు అంటూ శరత్ రెడ్డి  శాలువా కప్పి పుష్ప గుచ్చి అందించి అందజేశారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

About Author