PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుష్టు వ్యాధిగ్రస్తులకు గుర్తింపు కార్యక్రమం…

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటా కుష్టు వ్యాధిగ్రస్తులను  ఈనెల 27 నుండి జనవరి 12 వరకు గుర్తించడం జరుగుతుందని  ఎల్ సి డి సి, ఏవో డాక్టర్ చంద్రశేఖర్, డిపిఎమ్ఓ ప్రసాద్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి లెప్రసీ సర్వే రిపోర్ట్ ను పరిశీలించారు.3వ సచివాలయ పరిధిలో తెలుగు కాలనీలో ఇంటింటికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అధికారుల వెంట ప్రభుత్వ వైద్యాధికారి ఇమ్రాన్, నోడల్ అధికారి రామలింగారెడ్డి, ఆరోగ్య కార్యకర్త గార్లెట్, ఆశ వర్కర్ లక్ష్మీ తదితరులు ఉన్నారు.

About Author