PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వంశపారంపర్య అర్చకులుగా గుర్తించండి

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: వంశపారంపర్య అర్చకులుగా గుర్తించాలని కొందరు అర్చకులు మహానంది దేవస్థానం ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్​ను కోరారు. కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో వంశపారంపర్య అర్చకులుగా గుర్తించాలని కోరుతూ కొందరు అర్చకులు దరఖాస్తు చేశారు. తమ పూర్వీకులు ఎన్నో ఏళ్ల నుంచి స్వామి అమ్మవార్లకు సేవ చేశారని, వారి కుటుంబ సభ్యులైన తమకు దేవస్థానం అర్చకులుగా గుర్తించాలని కోరారు. ఈ విషయంపై ఆలయం ఈఓ మల్లికార్జున ప్రసాద్​ను ప్రశ్నించగా.. పూర్వీకుల అర్చకుల కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి… నివేదికను ఎండోమెంట్​ కమిషనర్​కు పంపుతామన్నారు. దేవస్థానం ఏఈఓ మధు మాట్లాడుతూ విచారించి ప్రభుత్వ ఆదేశాలనుసారం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో అర్చకులు వంశపారంపర్య అంశంపై దరఖాస్తు చేశారని అది ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

About Author