PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్పత్రుల్లో ఖాళీ బెడ్లను గుర్తించండి

1 min read

– కోవిడ్​ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించండి
– సబ్​ కలెక్టర్​ హెచ్​ఎం ధ్యానచంద్ర
పల్లెవెలుగు వెబ్, విజయవాడ: ప్రభుత్వ, అనుమతి పొందిన ప్రైవేట్​ ఆస్పత్రల్లో ఖాళీ బెడ్లను గుర్తించి… కోవిడ్​ బాధితులకు కేటాయించాలని, ఇందుకు ఆస్పత్రుల యజమాన్యాలతో సమన్వయం చేసుకోవాలని సబ్​ కలెక్టర్​ హెచ్​ఎం ధ్యానచంద్ర సూచించారు. 104 కాల్ సెంటర్ ద్వారా అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రుల్లోని బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్పత్రులకు వచ్చే రోగులకు టోకెన్లు రేజ్​ చేయాలని, పేషెంట్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని హోమ్ క్వాంటైన్కు, సిసిసి కి, ఆక్సిజన్ అవసరం ఉన్న, అవసరం లేని బెడ్డు వివరాలతో నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మరిన్ని ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతి ఇచ్చామని సబ్​ కలెక్టర్​ ధ్యానచంద్ర వెల్లడించారు.

About Author