PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ ఐదేళ్లలో జ‌రిగిన న‌ష్టాన్ని గుర్తించండి.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ ఐదేళ్లలో ఎంత న‌ష్టపోయామో ప్రతి ఒక్కరూ గుర్తించాల‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని ఏ.క్యాంపు మాంటిస్సోరి పాఠ‌శాల‌లో సిబ్బందితో నిర్వహించిన స‌మావేశంలో టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రతి వ‌ర్గం న‌ష్టపోయింద‌ని చెప్పారు. చ‌దువుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఐదేళ్ల పాల‌న‌కు.. గ‌త టిడిపి పాల‌న‌కు తేడాను గ‌మ‌నించాల‌ని కోరారు. త‌మ ప్రభుత్వం ఉండింటే రంజాన్‌కు తోఫా ఇచ్చేద‌న్నారు. ఈ ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇవ్వకుండా ముస్లింల‌ను బాధ‌పెడుతున్నార‌న్నారు. ప్రజ‌లంద‌రూ ఈ ప్రభుత్వాన్ని సాగ‌నంపి.. రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాల‌ని టి.జి భ‌ర‌త్ కోరారు. అన్ని ధ‌ర‌లు పెరిగిపోయి సామాన్యులు బ్రత‌క‌లేని ప‌రిస్థితి ఈ ప్రభుత్వంలో వ‌చ్చింద‌న్నారు. ఇప్పటికైనా ప్రజ‌లు మేల్కొనాలని ఆయ‌న సూచించారు. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపిస్తే ప‌రిశ్రమ‌లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలోని యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి అర్హులైన వారిలో తాను మొద‌టిస్థానంలో ఉంటాన‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. ద‌శాబ్దాలుగా ప్ర‌జాసేవ చేస్తున్న త‌మ‌ను ప్రజ‌లు ఆద‌రిస్తే మ‌రింత సేవ‌, అభివృద్ధి చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల యాజ‌మాన్యం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author