PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

48 గంట‌లు గ‌డిస్తే కానీ.. ఏమీ చెప్పలేం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: త‌మిళ‌నాడు కున్నూరు వ‌ద్ద జ‌రిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన ఆర్మీ అధికారి కెఫ్టన్ వ‌రుణ్ సింగ్ వెల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరు ఆస్పత్రికి త‌ర‌లించారు.  ఊటీ వెల్లింగ్టన్‌ మిలిటరీ ఆస్పత్రి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా సాయంత్రం బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కమాండ్‌  ఆస్పత్రికి తరలించారు. వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితిపై 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వెల్లింగ్టన్‌లో ఆయనకు వైద్యం చేస్తున్న వైద్యుల బృందం తెలిపింది. కొందరు అధికారులు ఆయనకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని చెబుతుండగా, తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు మాత్రం ఆయనకు 80–85 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. ఆయన పరిస్థితి ఇప్పటికీ సీరియస్‌గానే ఉంద‌ని వైద్యలు చెబుతున్నారు. ఆయన్ను లైఫ్‌ సపోర్టు వ్యవస్థపై ఉంచి చికిత్సనందిస్తున్నారు.

About Author