NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే.. సీఎం తీరు స‌రికాదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో సీఎం జగన్‌ స్పందించిన తీరు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ రాజధాని అమరావతేనని ఆయన స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావాలంటే రాజధాని కావడం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేసిందని ఆయన తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మీరు బ్లాక్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

                                

About Author