PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ గెలిస్తే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌లు షెడ్యూల్ ప్రకారం బీజేపీ ఎన్నికలు నిర్వహించి, గెలిస్తే తమ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ చేశారు. బీజేపీకి ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతం బీజేపీ అధీనంలో ఉన్నాయి. వీటి ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించేందుకు సిద్ధం కాగా, దీనికి కొద్ది సేపటికి ముందే బీజేపీ ఆ మూడు మున్సిపాలిటీలను ఏకం చేసే ఆలోచన ఉన్నట్టు ఈసీకి తెలిపిందని, దాంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదా పడిందని కేజ్రీవాల్ ఇటీవల విమర్శలు గుప్పించారు. ఇన్నేళ్లూ కాలయాపన చేసి ఈసీ షెడ్యూల్ ప్రకటించే సమయానికి విలీనం ప్రస్తావన చేయడం ఏమిటని బీజేపీని ఆయన నిలదీశారు.

                                               

About Author