PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. ఆయ‌నే ముఖ్యమంత్రి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే డీకే శివ‌కుమార్ క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి అవుతార‌ని శాంతిన‌గ‌ర్ ఎమ్మెల్యే హారిస్ న‌ల్సాడ్ కుమారుడు మ‌హ‌మ్మద్ న‌ల్సాడ్ వ్యాఖ్యానించారు. మ‌త్స్యకారుల‌తో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎవ‌ర‌నే విష‌యంపై చ‌ర్చ అన‌వ‌స‌ర‌మ‌ని అధిష్టానం హెచ్చ‌రించినా క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో మంట‌లు ఆర‌డం లేదు. ఇటీవ‌ల చామ‌రాజ‌న‌గ‌ర ఎమ్మెల్యే జ‌మీర్ అహ్మద్ .. తొలుత కాబోయే సీఎం సిద్ధరామ‌య్య అనడంతో.. పలువురు ఎమ్మెల్యేలు ఇదే వ్యాఖ్యల‌తో వ‌రుస క‌ట్టారు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి.. నేత‌ల‌ను హెచ్చరించింది. ఇప్పుడు మ‌హ్మద్ న‌ల్సాడ్ వ్యాఖ్యల‌తో మ‌రోసారి కాంగ్రెస్ లో మంట‌పుట్టింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎక్కువ ఓట్లు వచ్చిన‌ప్పటికీ.. క్రిమిన‌ల్ కేసుల కార‌ణంగా న‌ల్సాడ్ ను ప‌క్కకు పెట్టారు. డీకే శివ‌కుమార్ మ‌ధ్యవ‌ర్తిత్వంతో త్వర‌లో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌విని న‌ల్సాడ్ చేప‌ట్టనున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటార‌ని ప‌లువ‌రు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

About Author