NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ఫ్యూ ఉల్లంఘిస్తే .. కఠిన చర్యలు

1 min read
మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్​

మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్​

– కడప ఎస్పీ అన్బురాజన్​
పల్లెవెలుగు వెబ్, కడప: జిల్లాలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న 661 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప సబ్ డివిజన్ లో 146 వాహనాలు, పులివెందుల లో 21 , ప్రొద్దుటూరు లో 69 , జమ్మలమడుగు లో 149 , రాజంపేట లో 55 , మైదుకూరు లో 74, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో 102 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో ఎవరూ అనవసరంగా రోడ్లపై తిరగవద్దని, నిబంధనలు ఉల్లంఘించి తిరిగితే వాహనాలు స్వాధీనం చేసుకోవడం తో పాటు కేసులు నమోదు చేస్తామని ఎస్.పి హెచ్చరించారు. కరోనా వైరస్ కట్టడి కి పోలీసు శాఖకు అందరూ సహకరించాలని ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ విజ్ఞప్తి చేశారు.

About Author