NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్కొక్కరు 5 వేలు కడితేనే.. విమానంలో నుంచి దించుతాం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాజమండ్రి నుంచి తిరుపతి బయలుదేరిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేణిగుంట విమానాశ్రయానికి రావాల్సిన విమానం.. బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు వెళ్లింది. ఇండిగో సంస్థ విమానంలో తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. అయితే ఇండిగో విమాన సిబ్బంది వ్యవహార శైలిపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణీకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట వాతావరణం సరిగాలేక విమానం బెంగళూరులో ల్యాండ్ చేశామని సిబ్బంది చెప్పారని, తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్ అని తెలిసిందని అన్నారు. ఒక్కోరు 5 వేలు కడితేనే విమానంలో నుంచి దించుతామని ప్రకటించారని అన్నారు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టుకెళ్తామని ఆమె తెలిపారు.

About Author