NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ త‌గ్గించ‌కుంటే.. చెప్పుల‌తో స్వాగ‌తం !

1 min read

పల్లెవెలుగువెబ్ : సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు కే. నారాయ‌ణ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. సామాన్యులు వాడే చెప్పుల‌పై జీఎస్టీ త‌గ్గించ‌క‌పోతే బీజేపీ నేత‌ల‌కు చెప్పుల‌తో స్వాగ‌తం ప‌లుకుతామ‌ని అన్నారు. చెప్పులపై జీఎస్టీ పెంపునకు నిరసనగా తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం కూడలి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ షూ పాలిష్ చేస్తూ నిరసన తెలిపారు. వారికి వంత పాడితే రాష్టంలోను అదే చేస్తామన్నారు. నాడు జగన్‌పై చిందులు తొక్కారని.. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడుతున్నారన్నారు. తెలుగు రాష్టాల సీఎంలను లొంగ దీసుకోవటానికి బీజేపీ ఎత్తులు వేస్తోందన్నారు. బయటకు ఒకటి మాట్లాడటం, లోపల ఒకటి చేయటం వీళ్లకు అలవాటేనన్నారు.

                                           

About Author