PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌ల‌కు గాయ‌మైతే.. కండోమ్ తో క‌ట్టు క‌ట్టాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గాయమై తల నుంచి రక్తం కారుతున్న మహిళకు ఓ వైద్యుడు కండోమ్ రేపర్‌తో బ్యాండేజ్ వేశాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగింది. రక్తమోడుతున్న మహిళ తలపై కొద్దిపాటి దూది ఉంచి దానిపై కండోమ్ రేపర్‌ను వేసి తాత్కాలిక బ్యాండేజ్ వేశాడు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడంతో విషయం వెలుగు చూసింది. అక్కడ గాయానికి చికిత్స చేసేందుకు బ్యాండేజ్ విప్పిన వైద్యులు కండోమ్ రేపర్ చూసి షాకయ్యారు.

                                           

About Author