PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేను ఆగ్రహిస్తే… దాని అడ్రస్ ఉండదు

1 min read

పల్లెవెలుగువెబ్ : కొండామురళి,సురేఖ దంపతులపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్ జాతరలో కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలపై ధర్మారెడ్డి స్పందించారు. సమ్మక్క- సారలమ్మ జన్మస్థానమైన ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్‌ జాతరలో కొండా మురళి తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘కొండా దంపతులనే తరిమి కొట్టాను.. విగ్రహం ఓ లెక్కా..’ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ‘నేను ఆగ్రహిస్తే దాని అడ్రస్‌ ఉండదు’ అని మండిపడ్డారు. కొండా దంపతులు నిద్రపోతున్న సింహాలు కాదని, లేవలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవాచేశారు. ప్రజలు వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడంలేదని చెప్పారు.

         !

About Author