PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగనిస్తే పాదయాత్ర… లేకుంటే దండయాత్ర..

1 min read

– 200 రోజులు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర..

– సంఘీభావంగా నందికొట్కూరు లో కేక్ కట్ చేసిన తెలుగు తమ్ముళ్లు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా గురువారం  నందికొట్కూరు  టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య  ఆధ్వర్యంలో తెలుగు దేశం నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ చేపట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని,  అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ వచ్చిందని యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి అయ్యే సరికే ఈ ప్రభుత్వం పని అయ్యిపోయిందని, యువగళం పూర్తి అయ్యే సమయానికి వైసీపీ పాలకులు ఇంటికి పోవటం ఖాయమని, ప్రజాస్వామ్య బద్దంగా సాగే యువగళాన్ని సాగనిస్తే పాదయాత్ర అని లేకుంటే దండయాత్ర అని హెచ్చరించారు. రాష్ట్రంలో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, తెలుగుదేశం శ్రేణులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ, రేపటి నుండి ప్రారంభం కానున్న బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి, మండల కన్వీనర్లు కాతా రమేష్ రెడ్డి, పలుచాని మహేష్ రెడ్డి, మైనార్టీ నాయకులు జాకీర్ , మూర్తుజావలి ,మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి, బీసీ సంఘం నాయకులు మద్దిలేటి, వేణు గోపాల్, ఎస్సీ సెల్ పట్టణ కార్యదర్శి బొల్లెద్దుల చిన్న రాజన్న, సిరిగిరి  కళాకర్,మండల అధ్యక్షులు, పార్లమెంట్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, బీసి ఎస్సి,  నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు,  తెలుగుదేశం కార్యకర్తలు భారీ  పాల్గోన్నారు.

About Author