PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యవసరమైతేనే.. బయటకు రండి

1 min read
మాట్లాడుతున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి

మాట్లాడుతున్న ఆర్డీఓ రామకృష్ణారెడ్డి

– ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: కరోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కర్ఫ్యూ సమయంలో అవసరమైతే తప్పా.. బయటకు రావద్దొని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి సూచించారు. శనివారం గోనెగండ్ల కర్ఫ్యూను ఆయన పరిశీలించారు. ఈ నెలాఖరివరకు లాక్​డౌన్​ కర్ఫ్యూను పొడిగించిన విషయం అందరికీ తెలిసిందేనన్న ఆర్డీఓ… మధ్యాహ్నం 12 గంటల తరువాత అనవసరంగా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్​ వాడాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో వేణుగోపాల్, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, ఆర్ఐ సునీల్ కుమార్, వీఆర్ఓలు పోలీసులు, తలారీలు తదితరులు పాల్గొన్నారు.

About Author