NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీవో 111 ర‌ద్దు చేస్తే.. వినాశ‌నం త‌ప్ప‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పచ్చదనం, నేల, నీటి పరిరక్షణకు.. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు దోహదపడుతున్న జీవో 111ను రద్దు చేస్తే అది వినాశనానికి దారితీస్తుందని జల్‌ బారాదరి చైర్మన్, ‘వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని అధిక భాగం ‘సిమెంట్‌ కాంక్రీట్‌ జంగిల్‌’గా మారిపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవో 111ను ఎత్తేసి భారీ నిర్మాణాలకు అనుమతినిస్తే జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని ప్రాంతం అంతా బహుళ అంతస్తులు వెలసి.. అక్కడ కొత్తగా మరో పెద్ద కాం క్రీట్‌ అడవి ఏర్పడి వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. కర్బన ఉద్గారాలు, సిమెంట్‌ కట్ట డాల వల్ల ‘రేడియేషన్‌’ పెరిగి ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

                                               

About Author