PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోటార్ల‌కు మీట‌ర్లు పెడితే.. అది రైతు మెడ‌కు ఉరితాడే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మోటార్లకు మీటర్లు పెట్టకుండా రైతాంగం అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలోనే రైతులకు అభివృద్ధి జరిగిందని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో మిగులు కరెంట్ ఉండేదన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే అది రైతుల మెడకు ఉరితాడేనని చెప్పారు. ఒక్క ఛాన్స్ అన్నాడు రెండేళ్లలో శాశ్వతంగా పోతాడని సీఎం జగన్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. రెండేళ్లలో అధికారం నుంచి పోయేలోగా నాశనం చేస్తానంటే చూస్తూ ఉూరుకుంటామా? అని ప్రశ్నించారు.

                                    

About Author