PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేకు డబ్బు ఇచ్చి ఉంటే.. ఎంపీపీ పదవి వచ్చేది..!

1 min read

– ఎంపీటీసీ కుందూరు వెంకటేశ్వరమ్మ
పల్లెవెలుగు వెబ్​, ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ వెంకటాపురం ఎంపిటిసి వెంకటేశ్వరమ్మ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని, పార్టీ కోసం జెండా మోసిన నాయకులు, కార్యకర్తలను పక్కన పెట్టారని ఆరోపించారు. శనివారం పట్టణంలోని కుందూరు శివా రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఏడుగురిని ఏకగ్రీవం చేయడంలో కీలక పాత్ర పోషించిన తన భర్తతో ఎంపీపీ పదవి ఇస్తానని మాట ఇచ్చారని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఎంపీపీ పదవి కావాలంటే డబ్బులు ఇవ్వాలని అడగడం తో ఇవ్వలేకపోయానని, మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల మీద ఉన్న వ్యామోహం పార్టీకోసం జెండా మోసిన నాయకులు, కార్యకర్తల అభ్యున్నతిపై లేదని విమర్శించారు కుందూరు శివారెడ్డి దంపతులు. ఈ విషయంపై సీఎంవైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. మా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని కుందూరు దంపతులు స్పష్టం చేశారు.

About Author