PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కావాలంటే వైసీపీ స‌ర్కారు కేసు పెట్టుకోవ‌చ్చు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ప్ర‌భుత్వం పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు. జీవో నెం 217 మత్స్యకారులకు గుదిబండగా మారిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ నిర్వహించిన మత్య్సకారుల అభ్యున్నతి సభలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. జనసేనకు పది మంది ఎమ్మెల్యేలు ఉంటే 217 జీవో ఇవ్వడానికి సర్కారు ధైర్యం చేసేదికాదన్నారు. చట్టాలు నష్టాలను కలిగిస్తుంటే, వాటిని ఉల్లంఘించవచ్చన్నారు. తాను ఆ జీవో‎ను చించివేశానని తెలిపారు. కావాలంటే వైసీపీ సర్కారు పోలీసు కేసు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, మత్స్యకారుల సముద్ర వేటకు వెళ్ళే సాహసమే తనకు స్పూర్తి ఇచ్చిందని పవన్ పేర్కొన్నారు.

                                      

About Author