PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్లర్లు సృష్టిస్తే.. ఉపేక్షించను..

1 min read

– ఎస్​ఐ నాగార్జున రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, మహానంది: గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షిమించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మహానంది ఎస్​ఐ నాగార్జున రెడ్డి . ఆదివారం పోలీస్​స్టేషన్​ ఆవరణలో రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్​ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా.. బెదిరింపులు.. దౌర్జన్యాలకు దిగినా.. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి జీవించాలని, నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్​ఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే మండలంలోని రౌడీషీటర్లు, ఆకతాయిల వివరాలు సేకరించామని, వారిపై నిఘా ఉంచామని ఈ సందర్భంగా ఎస్​ఐ నాగార్జున రెడ్డి తెలిపారు.

About Author