PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇలాగే ఉంటే.. దేశం కోలుకోవ‌డానికి మ‌రో వందేళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని, దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఆక్షేపించారు. ప్ర‌స్తుతం దేశం ప్రమాదకరస్థితిలో ఉందని, విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలో మత పిచ్చి తప్పవేరే చర్చ లేదన్నారు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పేట్రేగిపోతే.. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. అశాంతి ఇలాగే ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు రావని, దేశం కోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదని హెచ్చ‌రించారు.

                                              

About Author