PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ వస్తేనే.. పేదల జీవితాల్లో వెలుగు..

1 min read

జొహారాపురంలో టి.జి భరత్ భరోసా యాత్ర

  • ఎండాకాలంలో దోమలను బ్రతికించిన ఘనత ఈ నాయకులది.. టి.జి భ‌ర‌త్

కర్నూలు,పల్లెవెలుగు:  టీడీపీ ప్రభుత్వం వస్తేనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని కర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ చెప్పారు. న‌గ‌రంలోని 18వ వార్డులోని జొహరాపురంలో ఆయన టి.జి భ‌ర‌త్ భ‌రోసా యాత్ర కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వీధుల్లోని ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ సంక్షేమ ప‌థ‌కాలు వివ‌రించారు. ఈ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు ఇచ్చి.. నిత్య‌వ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు, ప‌న్నులు, క‌రెంట్ బిల్లుల‌ రూపంలో ప్ర‌జ‌ల‌పై భారం మోపార‌ని వివ‌రించారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల‌న్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ప్ర‌జ‌లకు కష్టాలు రాకుండా చూసుకుంటామ‌న్నారు. క‌ర్నూల్లో అర్హులంద‌రికీ పింఛ‌న్లు, ఇళ్లు, ఇళ్ల ప‌ట్టాలు అందించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని టి.జి భ‌ర‌త్ హామీ ఇచ్చారు. వార్డుల్లో ప‌రిశుభ్ర‌త లేద‌ని, దోమ‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. తాను గెలిచిన త‌ర్వాత ఈ ప‌రిస్థితిని పూర్తిగా మార్చి ప్ర‌జ‌ల‌కు మంచి పాల‌న అందిస్తాన‌ని పేర్కొన్నారు. క‌ర్నూలుకు ప‌రిశ్ర‌మ‌లు తెచ్చి చ‌దువుకున్న యువ‌తకు ఇక్క‌డే ఉద్యోగాలు వ‌చ్చేలా కృషి చేస్తాన‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రి అయితే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయ‌ని తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు టిడిపికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మోహన్, వెంకటయ్య, మాధవస్వామి, తిమ్మోజీ, కార్పొరేటర్ పరమేష్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఎల్లా గౌడ్, తిరుపతయ్య, తిమ్మప్ప, చిట్టెమ్మ, శాంతమ్మ, అనిత, ఆనంద్, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

About Author