PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ వస్తే.. 20 లక్షల ఉద్యోగాలు: టి.జి భరత్

1 min read

6 గ్యారెంటీలు ఐదేళ్లలో పూర్తి చేస్తా

  •  సుబేదార్ వీధిలో టిజి భరత్ భరోసా యాత్ర

కర్నూలు, పల్లెవెలుగు:తమ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని రెండో వార్డు పరిధిలోని పాత బస్టాండు అంబేద్కర్ సర్కిల్ నుండి ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. అక్కడి నుండి సుబేదార్ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఎంత లాభం ఉంటుందో వివరించారు. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే పరిపాలన సాఫీగా సాగుతుందని టీజీ భరత్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసినప్పుడే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్నారు. కర్నూల్ లో తనను గెలిపిస్తే 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేసి నగరాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచేది ఖాయమని కర్నూల్ లో తనను గెలిపిస్తే అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ కమిటీ నగర అధ్యక్షుడు హమీద్, బూత్ ఇంఛార్జీలు, తదితరులు పాల్గొన్నారు.

About Author