PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.. టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కష్టాలు తీరుతాయని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టిజి భరత్ అన్నారు. నగరంలోని 42 వ వార్డు రాజీవ్ నగర్ లో ఆయన పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. టిడిపి మొదటి విడత మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీజీ భరత్ తో ప్రజలు వార్డులోని సమస్యలు చెప్పుకున్నారు. అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందడం లేదని మొరపెట్టుకున్నారు. అనంతరం ప్రజలతో టిజి భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు వస్తే సంపద సృష్టిస్తారని.. ఆ కెపాసిటీ ఆయనకు ఉందన్నారు. ఇక కర్నూల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగిస్తానన్నారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయకుండా మన రాష్ట్రంలోనే, మన జిల్లాలోనే ఉద్యోగాలు కల్పించేందుకు తాము కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఇంత పెద్ద వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా అర్హులకు సంక్షేమ పథకాలు ఎందుకు అందడం లేదో అర్థం కావడం లేదని భరత్ అన్నారు. సమస్యలు చాలా ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వీటన్నిటికీ పరిష్కారం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు వలి, హరి, సాయి, తిమ్మారెడ్డి, రామకృష్ణ, చంద్రశేఖర్, లక్ష్మీ రెడ్డి, గణేష్, దిలీప్, సత్య, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.

About Author