PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ అధికారంలోకి రాకపోతే మన బతుకులు అంధకారమే

1 min read

అంబేద్కర్‌ రాజ్యాంగానికి తూట్లు..

రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యం..

శాతనకోటలో  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మన బతుకులు అంధకారం అవుతాయని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి  హితవుపలికారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు  నందికొట్కూరు మండలం లోని శాతనకోట గ్రామంలో గురువారం  భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ టిడిపి నాయకులు నారాయణ, స్వాములు, వెంకటరెడ్డి, చిన్న సుబ్బయ్య, అలీముద్దీన్, సలీం బాషా  ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపో యిందని, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు నిత్యకృత్యమై పోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత, విజన్‌ ఉన్న నాయకుడు చంద్రబాబుతోనే రాష్ట్రానికి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, మహిళలకు భవిష్యత్‌ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ  రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ  జయసూర్య, టీడీపీ నాయకులు  గొల్ల కృష్ణ, మధు, మధు కుమార్, శేఖర్, రవి, సురేష్, ఓబుల్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, ప్రసాద రెడ్డి, రఘురామిరెడ్డి, రమేష్ రెడ్డి, మద్దిలేటి, ముర్తుజావాలి, రవి, చిన్న నాగలక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author