NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌త‌కం గెలిస్తే.. ఒక్కొక్కరికి 2.5 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : పంజాబ్ ఆటాగాళ్లకు ఆ రాష్ట్ర క్రీడా మంత్రి భారీ న‌జ‌రానా ప్రక‌టించారు. టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొన్న భార‌త హాకీ జ‌ట్టు బంగారు ప‌త‌కం సాధిస్తే.. జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 2.5 కోట్లు ఇవ్వనున్నట్టు క్రీడా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ సోది వెల్లడించారు. టోక్యో క్రీడ‌ల్లో పంజాబ్ కు చెందిన 11 మంది ఆటగాళ్లు బాగా ఆడుతున్నట్టు ఆయ‌న మెచ్చుకున్నారు. ఒలంపిక్స్ లో భార‌త హాకీ జ‌ట్టు వ‌రుస విజ‌యాల‌తో క్వార్టర్ ఫైన‌ల్స్ కు చేరుకుంది. పూల్-ఏ మొత్తంలో ఐదు మ్యాచ్ లు ఆడిన భార‌త జ‌ట్టు నాలుగు మ్యాచ్ లు గెలుచుకుంది. ఆస్ట్రేలియా మ‌న కంటే ముందు వరుస‌లో ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు క్వార్టర్స్ కు చేరుకున్నాయి.

About Author