NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్లమెంట్‌ను ముట్టడిస్తాం: సినీ నటుడు సుమన్ హెచ్చరిక

1 min read


పల్లెవెలుగు వెబ్: కేంద్ర ప్రభుత్వం కులగణన చేయకుంటే పార్లమెంట్ ను ముట్టడిస్తామని సినీ నటుడు, ఏపీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుమన్ హెచ్చరించారు. కేంద్రం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని ప్రకటించారు. చిత్తూరు నుంచి కాణిపాకం వరకు బీసీలు శంఖారావం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో సుమన్ పాల్గొన్నారు. కులగణనపై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని, వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సుమన్. బీసీల హక్కులపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై పోరాడాలని సూచించారు. బీసీల అంటే కేంద్రానికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు సుమన్.

About Author