PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమాన్య ప్రజలు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి

1 min read

– వై. నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ఆదివారం ప్యాపిలి పట్టణం నందు ఇదేమి కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యులుగా తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ వై. నాగేశ్వరరావు యాదవ్ ,డోన్ నియోజకవర్గం ఇంచార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వై .నాగేశ్వర యాదవ్ గారు మాట్లాడుతూ:ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రజల ప్రాణాలు కానీ, రాష్ట్ర భవిష్యత్తుపై గాని, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని కక్ష సాధింపులకు గురిచేయడం, వారిపై తప్పుడు కేసులు బనాయించడం మాత్రమే తెలుసు.రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర ధరలు నియంత్రించడం చేతకాని ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్య ప్రజల బ్రతుకులు గాడిన పడాలన్నా ఈ పెరిగిన నిత్యావసర ధరలు తగ్గాలన్న మనం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తే తప్ప రాష్ట్రంలో ఈ బాధలు తీరవు.

About Author