PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌క‌పోతే.. పార్టీ ర‌ద్దు చేస్తాం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మరో ఏడాదిలో జరిగే ఎన్నికలలో జేడీఎస్ కు మద్దతివ్వాల‌ని ఆ పార్టీ నేత మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌జ‌ల‌ను కోరారు. అధికారంలోకి వస్తే ముందుగా ఇచ్చిన హామీలన్నింటీనీ నెరవేరుస్తామన్నారు. లేదంటే ఐదేళ్ళ తర్వాత జేడీఎస్‌ పార్టీని రాష్ట్రంలో రద్దుచేస్తామని మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ సందర్భంలోను మేం చేతులు కట్టుకుని కూర్చోలేదని చేతనైనంత సాయం చేశామన్నారు. ప్రజలకష్టాలలో స్పందించే కార్యక్రమాలు నిరంతరంగా చేస్తున్నామన్నారు. ఒక శిక్ష మరో వైపు వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు వంటి పథకాలకు ప్రాధాన్యత నిస్తామన్నారు. ఎల్‌కేజీ నుంచి పీయూసీ దాకా ఉచిత విద్య అందించదలచామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో చదివించి తల్లిదండ్రులను అప్పులుపాలు చేయలేమన్నారు. ఉచితంగా ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామన్నారు. ఉచితంగా వైద్యసేవలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ఆరువేల గ్రామపంచాయతీలలో వైద్యసేవలు సమకూరుస్తామన్నారు.

                                       

About Author