PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యను కొడితే.. ల‌క్ష రూపాయల బ‌హుమ‌తి !

1 min read

పల్లెవెలుగు వెబ్ : సూర్య హీరోగా న‌టించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా ఓటీటీలో విడుద‌లైన‌ప్పటికీ సంచ‌ల‌నాలు సృష్టించింది. అన్ని వ‌ర్గాల ప్రజ‌ల నుంచి ప్రశంస‌లు అందుకుంది. కానీ కొంత మంది నుంచి విమ‌ర్శలు కూడ ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా జై భీమ్ చిత్ర నిర్మాత దర్శకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాదు వన్నియార్‌ కమ్యూనిటీని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మైలాడుతురైలో నటుడు సూర్య సినిమా ప్రదర్శనను నిరసిస్తూ బామాక ప్రజలు నిరసనకు దిగారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది.

About Author