PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎక్కువ మంది పిల్లలుంటే.. ల‌క్ష ప్రైజ్.. ఇండియాలోనే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఎక్కువ మంది సంతానం ఉంటే ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి అందిస్తామ‌ని మిజోరం మంత్రి ప్రక‌టన చేశారు. మిజో తెగ‌ల్లో జ‌నాభా పెంచేందుకే ఈ ప్రోత్సాహం ప్రక‌టించిన‌ట్టు మిజోరం మంత్రి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు జ‌నాభా నియంత్రణ పాటిస్తుంటే.. మిజోరం మంత్రి చేసిన ప్రక‌ట‌న ఆసక్తిక‌రంగా మారింది. మిజోరం మంత్రి రాబ‌ర్ట్ రొమావియా ఫాదర్స్ డే సంద‌ర్భంగా ఈ ప్రక‌ట‌న చేశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఐజ్వాల్ తూర్పు-2లో అధిక సంతానం ఉన్న వారికి ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఎంత మంది పిల్లలు ఉంటే న‌గదు బ‌హుమ‌తి ఇస్తామ‌నేది మంత్రి స్పష్టం చేయ‌లేదు.

About Author